బ్రేకింగ్: సింగపూర్‌ ఫైర్‌ యాక్సిడెంట్‌ ఘటనలో చిన్నారి మృ*తి |

సింగపూర్‌లో జరిగిన ఫైర్‌ యాక్సిడెంట్‌ ఘటనలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఓ చిన్నారి చనిపోయాడు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు.

  • Written By:
  • Updated On - April 8, 2025 / 05:23 PM IST

సింగపూర్‌లో జరిగిన ఫైర్‌ యాక్సిడెంట్‌ ఘటనలో విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఓ చిన్నారి చనిపోయాడు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఇదే యాక్సిడెంట్‌లో పవన్‌ చిన్న కొడుకు మార్క్‌ శంకర్‌ పవనోనవిచ్‌కు కూడా గాయాలయ్యాయి.

సింగపూర్‌లోని రివర్‌ వ్యాలీ షాప్‌ హౌజ్‌లో.. పవన్‌ చిన్న కొడుకు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ చదువుతున్నాడు. ఇవాళ ఉదయం ఆ స్కూల్‌లో ఫైర్‌ యాక్సిడెంట్‌ జరిగింది. ప్రమాదం సమయంలో స్కూల్‌లో దాదాపు 30 మంది పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంలో 19 మంది పిల్లలకు గాయాలయ్యాయి. పవన్‌ కొడుకు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. ఆ చిన్నారికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. మన్యం పర్యటన తరువాత పవన్‌ కూడా సింగపూర్‌కు వెళ్లనున్నారు.