బ్రేకింగ్: పహల్గాం ఎటాక్‌పై పాక్‌ హై కమిషన్‌లో సెలబ్రేషన్స్‌

పహల్గాం ఎటాక్‌పై పాకిస్థాన్‌ దొంగ ఏడుపు మరోసారి బట్టబయలైంది. గుంటనక్కలా బయటికి బాధ నటిస్తూనే.. పాకిస్థాన్‌ అధికారులు సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - April 24, 2025 / 02:45 PM IST

పహల్గాం ఎటాక్‌పై పాకిస్థాన్‌ దొంగ ఏడుపు మరోసారి బట్టబయలైంది. గుంటనక్కలా బయటికి బాధ నటిస్తూనే.. పాకిస్థాన్‌ అధికారులు సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. టెర్రరిస్ట్‌లు 26 మంది భారతీయులను చంపిన సందర్భంగా పాక్‌ హై కమిషన్‌లో సంబరాలు జరుగుతున్నట్టు సమాచారం.

ఈ క్రమంలో పాక్‌ హై కమిషన్‌ ముందు ఓ ఉద్యోగి కేక్‌తో కనిపించాడు. కేక్‌ లోపలికి తీసుకువెళ్తున్న అతన్ని మీడియా ప్రశ్నించింది. ఈ కేక్‌ ఎందుకు తీసుకెళ్తున్నావంటూ ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయాడు. పహల్గాం ఎటాక్‌ సందర్భంగా పాక్‌ హై కమిషన్‌లో సెలబ్రేషన్స్‌ జరుగుతున్నట్టు తెలుస్తోంది.