500యేళ్ళుగా యావత్ భారతీయులు ఎదురు చూస్తున్న అపూర్వ ఘట్టం అయోధ్యలో ఆవిష్కృతం అయింది. అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో బాల రాముడికి ప్రాణప్రతిష్ట జరిగింది. గర్భగుడిలో అందంగా అలంకరించిన రామయ్యను చూసి భక్తులు పరవశించిపోయారు. గర్భగుడిలో జరిగిన వేడుకల్లో ప్రధాని మోడీతో పాటు RSS చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనంది బెన్ పటేల్, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, ఆలయ పూజాలు పాల్గొన్నారు.

Ram devotees are flocking to Ayodhya to see Lord Rama.