తెలంగాణలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి వేదిక అయింది. కరోనా మూడేళ్ల సుదీర్థ విరామం తరువాత ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఏర్పాట్లును దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లలో సీసీ కెమెరాలను అమరుస్తున్న చిత్రం
జిహెచ్ఎంసీ పారిశుద్ద్య కార్మికులు చెత్తను తెలగిస్తున్నారు
క్యూ లైన్ల కోసం బారీగేట్లను ఏర్పాటు చేస్తున్నారు
వేల సంఖ్యలో పాల్గొనే అవకాశం
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు దిశా నిర్ధేశం చేస్తున్నారు.
పెద్ద ఎత్తున టెంట్లు ఏర్పాటు చేశారు
చేప మందు కోసం ఇప్పటికే క్యూ లైన్లలో వేచి ఉన్నారు.
సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వారికి ప్రత్యేక ఏర్పాట్లు
ఈ నెల 9 నుంచి చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
కరోనా తో మూడేళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఈ ఏడాది నిర్వహిస్తున్నారు
మృగశిర కార్తె ప్రారంభం రోజు దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ప్రాంగణానికి విచ్చేసిన వారితో మాట్లాడుతున్న తలసాని.