హైదరాబాద్ లోని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో యుద్ద విమానలతో విన్యాసాలు నిర్వహించారు. ఈ కంబైన్డ్ గ్రాడ్యూయేషన్ పరేడ్ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రివ్యూయింగ్ ఆఫీసర్ గా పాల్గొన్నారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటూ పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. వివిధ క్యాడర్ల తో గౌరవ వందనాన్ని స్వీకరించారు. సైనిక విన్యాసాలు వీక్షించిన వాళ్ళు ఆనందంతో సరికొత్త అనుభూతిని పొందారు.

President of India Draupadi Murmu attended the Combined Graduate Parade at Dundigal