ఈ ఎన్నికలలో రామ్మోహన్ రెడ్డి మక్తల్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయగా పర్ణిక రెడ్డి నారాయణపేటలో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అయితే.. రామ్మోహన్ రెడ్డి ఓటమి పాలవగా పర్ణిక విజయం సాధించారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే అరుణ పర్ణిక రెడ్డికి మేనత్త అవుతారు.
