తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత.. కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి శుక్రవారం ఉదయం కాసేపటి క్రితమే డిశ్చార్జ్ అయ్యారు. గత వారం రోజులకు పైగా కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.. గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలంటే సుమారు 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు చెప్పడంతో.. నందినగర్ నివాసానికి తీసుకెళ్లి ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. దీంతో కేసీఆర్ ను బంజారాహిల్స్ నందినగర్ లోని తన నివాసానికి తీసుకెళ్లున్నారు.

Former CM KCR discharged from Yashoda Hospital.