తనకు గతంలో ఉన్న భద్రత కుదించడంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది. వైఎస్ జగన్ ప్రస్తుతం వినియోగిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ బదులు వేరొక వాహనాన్ని ఏర్పాటు చేయాలని హై కోర్టు ఆదేశించింది. జగన్ మోహన్ రెడ్డికి బులెట్ ప్రూఫ్ వాహనం కేటాయించాలని ప్రభుత్వానికి హై కోర్టు సూచించింది. జగన్ కు రిమోట్ కంట్రోల్ ద్వారా హాని జరిగే అవకాశం ఉన్న చోట […]
