భారత్ రైళ్లకు ఏమైంది. మన్నటి వరకూ ఒడిశాలో బోగీలు అగ్గిపెట్టెల్లా చెల్లాచెదురై నేలపై పడిన పరిస్థితి. నిన్న బీహార్ లో బలమైన ఐరన్ చక్రాలు విరిగిన దుస్థితి. ఇక తాజాగా ఫలక్ నుమా రైలు బోగీలు మంటలకు దగ్ధమయ్యింది. దీనికి కారణాలు ఏమైనప్పటికీ రైల్వే అధికారులు మేల్కొవల్సిన సమయం ఆసన్నమైంది. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న రైల్వే శాఖ పనితీరుకు సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి నెలకొంది.

Howrah to Secunderabad Falaknuma Express met with a fire accident at Yadadri Bhuvanagiri