సొంతగడ్డపై తొలిసారి పరువు కోసం భారత క్రికెట్ జట్టు పాకులాడుతోంది. ఊహించని విధంగా న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియాకు ఇప్పుడు వైట్ వాష్ గండం పొంచి ఉంది. ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి జరిగే చివరి టెస్టులోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తోంది.
