The BAPS Hindu Mandir: యూఏఈలో తొలి హిందూ దేవాలయం.. 14న ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ఇది యూఏఈలోని మొదటి హిందూ దేవాలయం. ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన 13.5 ఎకరాల భూమని అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ విరాళంగా ఇచ్చారు. 2015లో ప్రధాని మోదీ అక్కడ పర్యటించినప్పుడు ఈ మేరకు భూమి కేటాయించారు.