అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా పలు దేశాధినేతలు సదస్సుకు హాజరవుతుండటంతో ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. జీ20 సదస్సులో పాల్గొనాల్సిందిగా భారత్ వివిధ దేశాధినేతలకు ఆహ్వానాలు పంపింది. వారిలో కొందరు హాజరు కావడం లేదు.