ఏపీలో అక్రమ ఓట్ల గురించి ఫిర్యాదులు రావడం ఇదేం కొత్త కాదు. టీడీపీ హయాంలో కూడా ఇదే తరహా ఆరోపణలొచ్చాయి. తమకు అనుకూలంగా లేని వారి ఓట్లను జాబితా నుంచి తొలగించారని, లేని ఓట్లను సృష్టించుకున్నారని టీడీపీపై వైసీపీ అప్పట్లో విమర్శలు చేసింది. ఇప్పుడు అదే పని వైసీపీ చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది.
