అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదం.. ఏపీ ఉలిక్కిపడేలా చేసింది. అప్పటి వరకు హాయిగా వినిపించిన నవ్వులు.. రేపటి గురించి మాట్లాడుకున్న మనుషులు.. ఒక్క క్షణంలో కాలి బూడిదయ్యారు. శరీరాలు ఛిద్రమయి.. ఏ భాగం ఎవరిదో గుర్తుపట్టలేని స్థితిలో.. ఆ ప్రమాదం గురించి తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది.
