వాళ్లు.. దేశానికి పతకాల పంట పండించిన క్రీడాకారులు.. మూడు రంగుల జెండాను ఎత్తుకుని గర్వంగా నిలబడ్డ వాళ్లు.. చుట్టూ ఉన్న ప్రేక్షకులంతా చప్పట్లు కొడుతుంటే.. అవి తమకు మాత్రమే కాదు.. మొత్తం భారత దేశానికి అని భావించిన వాళ్లు. పతకాలతో దేశం తిరిగొస్తే.. అభిమానులతో ఘన స్వాగతం అందుకున్న వాళ్లు.. ఇదంతా గతం..! ఇంత కీర్తి అందుకుని, కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన క్రీడాకారులు ఇప్పుడు ఇదే దేశంలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అధికార బలానికి, పోలీసుల కాఠిన్యానికి బలవుతున్నారు.
