చంద్రుడిపైకి వ్యోమనౌకను పంపి, విజయవంతం చేసింది ఇస్రో. అది కూడా అతి తక్కువ ఖర్చుతో. దీంతో అమెరికాసహా ఇతర దేశాలు భారతీయ సాంకేతికతను చూసి ఆశ్చర్యపోయాయి. అయితే, ఈ సాంకేతికతే నచ్చిన అమెరికా ఈ టెక్నాలజీని తమతో పంచుకోవాలని అడిగినట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు.
