Reserve Bank Of India: రూ. 2 వేలు కాదండోయ్.. 500 రూ. నోటు కుడా డౌటే..? దీని వెనుక అసలు రహస్యం ఇదే..!
గతంలో నోట్లు అంటే అంతగా పట్టించుకునే వారు కాదు. అవసరమైనప్పుడు ఖర్చు చేసుకునేందుకు మాత్రమే బయటకు తీసేవారు. కానీ గడిచిన ఐదు నుంచి ఏడు సంవత్సరాలుగా ఏ క్షణంలో ఏ ప్రకటన వస్తుందో అన్న భయాందోళనలో ప్రజలు మగ్గిపోతున్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్న ఒక సంచలనమే. నోట్ల రద్దు నుంచి లాక్ డౌన్ వరకూ లేడికి లేచిందే పరుగు అన్న విధంగా ప్రభుత్వాలు తమ నిర్ణయాలను తీసుకున్నాయి. దీని వల్ల ఇబ్బందులకు గురైంది మాత్రం సామాన్యులే అని చెప్పాలి. తాజాగా రెండు వేల నోటును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన ఆర్జీఐ త్వరలోనే మరో బాంబు పేల్చేందుకు సిద్దంగా ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. అదే రూ.500 నోటును కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకు ఇలాంటి సంచలనాలకు కేరాఫ అడ్రస్ గా మారుతోంది. పరిపాలనా లోపమా.. నిజంగానే నల్ల ధనాన్ని వెలికితీయడమా అనేది కేంద్రమే పునరాలోచించుకోవాలి.