Telugu states : తెలుగు రాష్ట్రాలపై చలి పంజా.. రోజురోజుకు పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఇప్పటికే గజగజా వణుకిపోతున్నారు ప్రజలు. రోజురోజుకు చలి తీవ్రత పెరిగిపోతునే ఉంది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రమంతటా ఉదయం 9 గంటల వరకు మంచుతో కప్పి ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలే కాదు.. పగటి ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలిగాలులు మొదలవుతున్నాయి.