PAKISTAN: దుబాయ్ లో చికిత్స పోందుతూ తుది శ్వాస విడిచిన పర్వేజ్ ముషారఫ్
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ తుది శ్వాస విడిచారు. దుబాయ్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ముషారఫ్. ప్రస్తుతం ఆయన వయసు 79ఏళ్లు. దుబాయ్లోని ఆసుపత్రిలో చేరిన ముషారఫ్ను ముందుగా రావల్పిండిలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ (ఏఎఫ్ఐసీ)కి తరలించారు. మార్చి 2016 నుండి దుబాయ్లో ఉన్న ముషారఫ్ అమిలోయిడోసిస్కు చికిత్స పొందుతున్నారు. అమిలోయిడోసిస్ కారణంగానే ముషారఫ్ ఈరోజు మరణించారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. కొన్ని […]