Weather Update : దేశ వ్యాప్తంగా భారీ ఎండలు.. భానుడి భగభగ.. జనం విలవిల
దేశ వ్యాప్తంగా వడదెబ్బ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారీ ఉష్ణోగ్రతలకు తాళలేక ఉత్తరాది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. బిహార్లోని ఔరంగాబాద్లో బుధవారం 48.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, వేడి సంబంధ సమస్యలతో జిల్లా ఆస్పత్రిలో 2 గంటల వ్యవధిలో 16 మంది మరణించారు. గత 24 గంటల వ్యవధిలో వడగాలులకు మరో 19 మంది చనిపోయారు