hospitals

Govt Hospitals: ప్రభుత్వ ఆసుపత్రులు.. పసిపిల్లల పాలిట యమపాశాలా.?

Govt Hospitals: ప్రభుత్వ ఆసుపత్రులు.. పసిపిల్లల పాలిట యమపాశాలా.?

పురిటి నొప్పుల విలువ ఒక్క తల్లికే తెలుస్తుంది. ఎందరు ఎన్ని మాట్లాడుకున్నా ప్రసవవేదన ముందు అన్నీ తక్కువే అవుతుంది. పిల్లాడు పుట్టడమే గొప్ప వరంగా భావించే వారు సమాజంలో ఉన్నారు. అదే లోకంలో పుట్టిన పిల్లలను అశ్రద్థ చూపి పురిటిలోనే పాణాలు కోల్పోయేలా చేస్తున్నారు. అదికూడా అతిదారుణంగా వారి బ్రతుకులను చిదిమేస్తున్నారు. ఆసుపత్రిలో ఎలుకలకో, రోడ్డున తిరిగే వీధి కుక్కలకో అదీ కాకుంటే ఆసుపత్రిలో లంచం తీసుకొని వెంటిలేటర్లు మార్చేసి బలి పెడుతున్నారు. ఇదంతా ఒకఎత్తైతే ఆపరేషన్ థియేటర్లో పాములు సంచరిస్తుండటం మరింత విడ్డూరం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి కలిచివేసే ఘటన చోటు చేసుకుంటే మన్న తెలంగాణలో దుర్మార్గమైన చర్య వెలుగులోకి వచ్చింది. నేడు ఇదే రకమైన పరంపర రాజస్థాన్ లోనూ కొనసాగుతోంది.