Mukesh Ambani: రిలయన్స్లో కొత్త తరం.. కొత్త రక్తం.. కంపెనీల్లో వారసులకు పెద్దపీట..!
రిలయన్స్ ఏజీఎంలో ముఖేష్ అంబానీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తన భార్య నీతా అంబానీని రిలయన్స్ బోర్డు నుంచి తప్పించారు. తన ముగ్గురు పిల్లలు ఇషా అంబానీ, అనంత్ అంబానీ, ఆకాష్ అంబానీలను రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో నాన్ ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్లుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.