వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది.
ఎండలతో విసిగిపోయిన తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు చల్లటి వార్త చెప్పారు. కాస్త ఆలస్యం అయినప్పటికీ ఈ నెల 21న తెలంగాణకు రుతుపవనాలు రాబోతున్నాయని చెప్పారు.