Telangana BJP : లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ అస్త్రాలు సిద్ధం
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) కోసం సకల అస్త్ర శస్ర్తాలను సిద్ధం చేసుకుంటోంది బీజేపీ(BJP). తెలంగాణలో ఈసారి డబుల్ డిజిట్ కొట్టాలన్న టార్గెట్తో గెలుపు గుర్రాల కోసం వెతుకుతోంది. రక రకాల లెక్కలు, ఎక్కాలతో అభ్యర్థుల ఎంపికపై నజర్ పెట్టింది అధిష్టానం. అదే సమయంలో ఆశావహుల సంఖ్య కూడా పెరిగిపోతోందట. అయోధ్యలో రామమందిర (Ayodhya Ram Mandir) నిర్మాణం, మోడీ చరిష్మా కలిసి వచ్చి గెలుపు తేలికవుతుందన్న అంచనాలతో ఎవరికి వారు సీటు మాకంటే మాకంటూ ఓ రేంజ్లో లాబీయింగ్ చేస్తున్నారట.