Patnam Mahender Reddy: కాంగ్రెస్లోకి పట్నం మహేందర్ రెడ్డి.. బీఆర్ఎస్, బీజేపీకి షాక్ తప్పదా..?
మరో వారంలోనే పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణా రావు ఆ పార్టీలో చేరబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరింత మంది నేతలు కూడా ఆ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్లో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది.