TDP Vs YCP: వినుకొండలో వైసీపీ వర్సెస్ టీడీపీ.. నేతల మధ్య ఘర్షణ.. గాల్లోకి సీఐ కాల్పులు
తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే, అడ్డుకుని అక్రమ కేసులు పెడతారా అని ప్రశ్నిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మరోసారి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఈసారి వైసీపీ నేతలు అడ్డుకున్నారు. వినుకొండ బస్టాండ్ సెంటర్ వద్ద టీడీపీ నేతల్ని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త తలెత్తి, ఘర్షణకు దారితీసింది.