TS ASSEMBLY : కలసి బిర్యానీ తిని… తెలంగాణకు అన్యాయం – కేసీఆర్-జగన్ దోస్తీపై ఉత్తమ్ ఫైర్
సాగు నీటి విషయంలో బీఆర్ఎస్ (BRS) తెలంగాణ (Telangana) కు అన్యాయం చేసిందని అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అప్పటి రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్…. అలయ్… బలయ్ చేసుకొని బిర్యాలు తిని… విందులు చేసుకొని …ఆంధ్రాకు నీళ్ళను అప్పగించారని ఆరోపించారు ఉత్తమ్. రాష్ట్రంలో ఓడిపోతామని తెలిసే ఆంధ్రకు నీళ్ళు ఇచ్చారని మండిపడ్డారు.