CM Revanth Reddy : మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించిన.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి వెంట మంత్రి మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. ముందుగా మొదటి సారి సీఎం హోదాలో యశోద ఆసుపత్రికి వచ్చిన రేవంత్ రెడ్డి ఆసుపత్రి యాజమన్యం స్వాగతం పలికింది. అనంతరం కేసీఆర్ వద్దకు మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ చేతిలో చేయి వేసి ఓనికి వెళ్లారు. కేటీఆర్ తో కలిసి కేసీఆర్ ను పరామర్శించించారు.