YCP in-charges : జనవరి 1లోగా వైసీపీ ఇన్చార్జిల మార్పు .. 60 స్థానాల్లో కొత్తముఖాలకు ఛాన్స్?
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు వేగవంతం చేసారు. గురు, శుక్రవారాల్లో జాబితా ప్రకటించేలా ముందుకెళ్తున్నారు. దాదాపు 60 స్థానాల్లో కొత్త ముఖాలు రానున్నాయి. ఇప్పటికే కొన్ని స్థానాలకు ఇంచార్జిలను మార్పు చేశారు వైసీపీ అధినేత జగన్. మరిన్ని స్థానాలకు ఇంచార్జీలను ప్రకటించే దిశగా ప్లాన్ చేస్తున్నారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లతో జరిగిన సమావేశంలో సీట్ల ప్రకటనపై కీలక నిర్ణయం తీసుకున్నారు.