విజయనగరం జిల్లా శృంగవరపుకోట వైసీపీ (YCP)లో విచిత్రమైన రాజకీయం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మధ్య వర్గ పోరు తారా స్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాలని ఎమ్మెల్సీ పట్టు పట్టినా… వైసీపీ అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో రఘురాజు భార్య సుధారాణి (Sudharani), ఆయన అనుచరులు టీడీపీకి టచ్లోకి వెళ్ళారు. రఘురాజు వెరైటీగా తాను వైసీపీలో ఉంటూ… భార్యను, అనుచరుల్ని టీడీపీలోకి పంపే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదెక్కడి విడ్డూరంరా.. బాబూ… అని నోళ్ళు నొక్కుకుంటున్నారు ఈ వ్యవహారం చూస్తున్నవారు.

This is this... the wife is one party... the husband is another party... strange politics in that house!