ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాలో వైసీకి కీలకంగా ఉన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రిజైన్ చేశారు. ఆయన భార్య ప్రశాంతితో కలసి ఈనెల 23న టీడీపీలో చేరుతున్నారు. వైసీపీ సభ్యత్వానికి, జిల్లా అధ్యక్ష పదవికి కూడా వేమిరెడ్డి రాజీనామా చేశారు. అభిమానులు, కార్యకర్తలతో సమావేశం తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు
