2047 సంవత్సరం కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అంటుంటే.. పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విడుదల చేసిన రిపోర్టులో ఇదే విధమైన అంశాలను ప్రస్తావించారు. దేశంలోని ప్రజల పొదుపులు గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో సగానికి సగం (55 శాతం) తగ్గి, ఏకంగా 47 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయినట్లు ఎస్బీఐ తాజా రీసెర్చ్ రిపోర్టు పేర్కొంది.

By the year 2047 India will become a developed country According to the latest SBI research report the savings of the people in the country has halved 55 per cent in the last financial year 2022-23) falling to a 47-year low