తెలంగాణలో నిరుద్యోగులకు రెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కొలువుల భర్తీ లేక.. పేపర్స్ లీక్, వాయిదాలతో విసుగెత్తిపోయారు నిరుద్యోగులు. దాంతో కేసీఆర్ సర్కార్ కు వ్యతిరేకంగా ఓట్లేశారు. జాబ్ కేలండర్ ఇస్తామనీ.. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చే దిశగా రేవంత్ అడుగులు వేయబోతున్నారు. TSPSC ఛైర్మన్ జనార్థన్ రెడ్డిని మీటింగ్ కు రమ్మని CMO నుంచి ఆదేశాలు వెళ్ళాయి.

CM Revanth Reddy is going to give good news to the unemployed in Telangana in two days.