యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఎప్పుడూ ముందుంటాడు. అది జాతీయ జట్టుకు ఆడేటప్పుడైనా, ఐపీఎల్ కు ఆడినప్పుడైనా యువ బౌలర్లను ఎంతగానో మోటివేట్ చేస్తాడు. వికెట్ల వెనుక ఉన్నా ఎప్పటికప్పుడు వారికి సలహాలు ఇస్తూ అద్భుతమైన ఫలితాలు రాబడుతుంటాడు
