రైతు ఉద్యమాలకు పుట్టినిల్లు… ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గం. పసుపు బోర్డు (Yellow Board), గల్ఫ్ కుటుంబాలు(Gulf Families), నిజాం చక్కర కర్మాగారం(Nizam Chakkar Factory), బీడీ కార్మికుల సమస్యలు ఇక్కడ ఇవే ప్రధాన సమస్యలు. నిజామాబాద్ లో పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం అంతా ఈ సమస్యలపైనే నడుస్తుంది. ముఖ్యంగా ఈసారి పసుపు బోర్డు అంశం ఎన్నికల్లో ప్రధాన అస్త్రం కాబోతోంది. కేంద్రం నుంచి బోర్డును తీసుకొస్తానని హామీ ఇచ్చి గెలిచిన అర్వింద్… ఐదేళ్ళు కాలక్షేపం చేశారని కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శిస్తున్నాయి.

Is it necessary to bring yellow board to Nizamabad this time..?