గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో భారత జట్టు అదరగొట్టింది. పూర్తిగా కుర్రాళ్ళతో బరిలోకి దిగిన టీమిండియా బంగ్లాను చిత్తు చేసింది. మొదట బౌలింగ్, తర్వాత బ్యాటింగ్ తో పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది.