ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన చివరి టెస్టులో న్యూజిలాండ్ 25 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ ను 3-0తో వైట్ వాష్ చేసింది. అయితే ఈ మ్యాచ్ మూడోరోజు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. కివీస్ ను త్వరగానే ఆలౌట్ చేసిన భారత్ బ్యాటింగ్ లో మాత్రం చేతులెత్తేసింది.
