పంత్ కు రూ.30 కోట్లు ఏ జట్టు కొంటుందో చెప్పేసిన రైనా
మెగావేలం కోసం అన్ని ఫ్రాంచైజీలు రెడీ అయ్యాయి. వచ్చే ఆదివారం,సోమవారం సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా ఆటగాళ్ళ వేలం జరగబోతోంది. ఈ సారి మెగా ఆక్షన్ కావడంతో స్టార్ ప్లేయర్స్ లో చాలా మంది వేలంలోకి రావడం మరింత హైప్ క్రియేటయింది. వేలంలో ఎవరు జాక్ పాట్ కొడతారో… అత్యధిక ధర ఎవరికి వస్తుందో అన్న అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.