టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ జాతీయ జట్టులో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నాడు. గత ఏడాది వన్డే ప్రపంచకప్ తర్వాత గాయపడిన షమీ ఇటీవలే రంజీ ట్రోఫీతో మళ్ళీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. రీఎంట్రీలోనూ మంచి ప్రదర్శనతోనే ఆకట్టుకున్న షమీపై బీసీసీఐ సెలక్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
