తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు అయిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇక మరో పార్టీ పార్టీ అయిన బీఎస్పీ పార్టీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 99 అభ్యర్ధులను ప్రకటించింది. కాగా ఇవాళ మరో 20 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి టికెట్ పొంది.. చివరి క్షణంలో టికెట్ కోల్పొయిన పటాన్ చెరు అభ్యర్థి నీలం మధు.. బీఎస్పీ పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్ర ఉప అధ్యక్షుడు దయానంద్ చేతుల మీదుగా.. బీ ఫార్మ అందుకున్న నీలం మధు ముదిరాజ్.

Telangana BSP released the fifth list Party President RS Praveen Kumar