తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. మరో కొన్ని గంటల్లో రిజల్ట్స్ రాబోతున్నాయి. హ్యాట్రిక్ కొడతాం.. మళ్లా అధికారంలోకి వస్తాం అన్న ధీమా సీఎం కేసీఆర్, కేటీఆర్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ కే అధికారం అని చెబుతున్నా.. అవన్నీ తప్పని నిరూపిస్తామంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురువారం పోలింగ్ జరుగుతున్నప్పుడే రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్ మెంట్ ను తెలుసుకుంటూ కొన్ని ఈక్వేషన్లు.. మరికొన్ని లెక్కలతో హ్యాట్రిక్ పక్కా అన్న నిర్ణయానికి వచ్చేశారు. అందుకేనేమో.. ఫలితాల తెల్లారి అంటే 4నాడు మధ్యాహ్నం రెండింటికి కేబినెట్ మీట్ పెట్టారు సీఎం కేసీఆర్.
These are KCR's calculations for Telangana state assembly elections..! Dhima assured that 70 seats are fixed.