ఇరానీ కప్ కోసం బీసీసీఐ రెస్టాఫ్ ఇండియా జట్టును ప్రకటించింది. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను రెస్టాఫ్ ఇండియా సారథిగా ఎంపిక చేసింది. అభిమన్యు ఈశ్వరన్ అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.