ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం కనసానిపల్లి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమ గ్రావెల్ మైనింగ్ దందా యథేచ్ఛగా సాగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణ అవసరాల పేరుతో అనుమతులు పొంది, నిబంధనలను బొందపెడుతూ యంత్రాలతో మైనింగ్ నిర్వహిస్తున్న తీరుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
