టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల స్థితిగతులను ప్రజలకు చాటి చెప్పడమే లక్ష్యంగా ఆయన జిల్లాల పర్యటనకు వెళుతున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టులను గాలికి వదిలేసిందని, తక్కువ ఖర్చయ్యే ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేదని ఆయన ఆరోపిస్తున్నారు.
