జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.. నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా జనసేన ప్రకటించింది.. కడియంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు పరామర్శించనున్న పవన్ కల్యాణ్.. కొత్తపేట మండలం ఆవిడిలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.. మధురపూడి విమానాశ్రయం నుండి పవన్ కల్యాణ్ పర్యటన ప్రారంభం కాబోతోంది.

Pawan Kalyan Tour on East Godavari