వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీ సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఎంపీ పిల్లి సుభాశ్ చంద్రబోస్ బహిరంగంగానే ప్రకటించారు. అధిష్టానం బుజ్జగించినా ఆయన వైఖరిలో మార్పు కనిపించడం లేదు. ఆయన త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని నియోజకవర్గంలో జోరుగా టాక్ నడుస్తోంది.
