అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై రెండ్రోజులపాటు విచారణ జరిపిన హైకోర్టు తుది తీర్పును 31న వెల్లడిస్తామని చెప్పింది. అప్పటివరకూ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశించింది. దీంతో సీబీఐ మరోసారి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.