కేటీఆర్ సమక్షంలో రాజయ్య, కడియం శ్రీహరి కలిపోయారు. చేతులు కలుపుకున్నారు. శ్రీహరి కడుపు మీద చేయి పెట్టి మరీ.. తన ఆప్యాయత చూపించారు రాజయ్య. ఇదంతా బయటకు కనిపించే సీన్. నిజంగా ఇది నిజమా అంటే.. లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక అంటున్నారు రాజకీయాన్ని దగ్గరి నుంచి చూస్తున్న వాళ్లు!
