ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని విధంగా రోజుకో సరికొత్త మలుపు తిరుగుతోంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు నివాసానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి వెళ్తుండటం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ పెను సంచలనంగా మారింది.
