Rahul Gandhi: వాట్ ఈజ్ దిస్ రాహుల్…! పరాయి గడ్డపై దేశం పరువు తీస్తారా..?
రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లారు. కేంబ్రిడ్జిలో ప్రసంగించారు. అందులో తప్పేం లేదు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓ జాతీయపార్టీ ముఖ్యనేతగా ఆయన అక్కడ ప్రసంగించడం చాలా గర్వించాల్సిన విషయం. కానీ దేశం కాని దేశంలో…అదీ వందల ఏళ్లు మనల్ని వంచించి, విభజించి పాలించిన దేశంలో మన దేశ పరువు తీయడం మాత్రం ఇబ్బందికరంగా అనిపిస్తోంది.